వాటర్ ట్యాంక్ పై కొలువుదీరిన వినాయకుడు..!
వాటర్ ట్యాంక్ పై కొలువుదీరిన వినాయకుడు..!
వనపర్తి , మన సాక్షి :
గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఊరూరా జరుపుకుంటున్నారు. భక్తులు మండపాలు ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు. కాగా ఇక్కడ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. వనపర్తి జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వాటర్ ట్యాంక్ పై నిర్వహిస్తున్నారు ఆ భక్తులు.
వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా రేపల్లె మండల కేంద్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వినూతనంగా ఓవర్ హెడ్ ట్యాంక్ పైన ఏర్పాటు చేశారు. ఆ గ్రామంలో 30 సంవత్సరాల క్రితం వాటర్ ట్యాంక్ నిర్మించారు. అప్పటినుంచి కూడా ఆ గ్రామస్తులు మండపం ఏర్పాటు చేయకుండా వాటర్ ట్యాంక్ మధ్యలోనే ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
భక్తులు గణపయ్యను పూజించడానికి వాటర్ ట్యాంక్ పైకి ఎక్కడానికి మెట్లు ఏర్పాటు చేశారు. వర్షం వచ్చినా, వరద వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్యాంక్ పైన భక్తులు ఏర్పాట్లు చేశారు. ఇలాంటి ఆలోచన ఆ గ్రామస్తులు చేసినందుకు భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
LATEST UPDATE :
Jagityal : అక్రమంగా నిల్వ ఉంచిన భారీగా పిడిఎస్ బియ్యం పట్టివేత..!
Miryalaguda : వారిది మహోన్నత త్యాగం, పరిహారంతో పాటు ఉద్యోగం.. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క..!
BIG BREAKING : గొంతుకోసి.. కాలువ కట్ట పై వ్యక్తి హత్య..!
మహిళలకు సువర్ణావకాశం.. దరఖాస్తు చేసుకున్న రెండు రోజుల్లో రూ.5 లక్షలు..!









