Breaking Newsక్రీడలుజిల్లా వార్తలుతెలంగాణపెద్దపల్లి జిల్లా

Peddapalli : రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు ఎంపికైన విద్యార్థులు..!

Peddapalli : రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు ఎంపికైన విద్యార్థులు..!

ధర్మారం, మన సాక్షి ప్రతినిధి,

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికైనట్టు ప్రిన్సిపల్ ఈరవేణి రాజ్ కుమార్ తెలిపారు.

ఏడవ తరగతి చదువుతున్న ఇంద్ర ప్రియదర్శిని,ఆర్ అర్చన, కే నరేష్, కార్తికేయ రాష్ట్ర స్థాయి ఎస్ జి ఎఫ్ అండర్ 14 హాకీ పోటీలకు ఎంపికయ్యారని వీరు ఈనెల 29 నుండి డిసెంబర్ 1వరకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో జరిగే రాష్ట్రస్థాయి ఎస్ జి ఎఫ్ అండర్ 14 ఉమ్మడి కరీంనగర్ జిల్లా తరఫున రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.

వీరి ఎంపిక పట్ల ప్రిన్సిపల్ రాజకుమార్, వ్యాయామ ఉపాధ్యాయుడు బైకని కొమరయ్య, ఎం సంజీవరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు వీరిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

MOST READ : 

మరిన్ని వార్తలు