Breaking Newsక్రైంతెలంగాణనల్గొండ

Miryalaguda : రోడ్డు ప్రమాదంలో పురోహితుడు మృతి..!

Miryalaguda : రోడ్డు ప్రమాదంలో పురోహితుడు మృతి..!

దామరచర్ల, మన సాక్షి:

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం లోని దామచర్ల మండల కేంద్రంలోని అద్దంకి నార్కెట్ పల్లి రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇర్కి గూడెం గ్రామానికి చెందిన అమరయ్య (80) అనే వృద్ధుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం అమరయ్య అనే వృద్ధుడు పౌరోహిత్యం చేస్తూ జీవనాధారం సాగిస్తున్నాడని, సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో దామర చర్ల బస్టాండ్ సెంటర్లో రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని తీవ్ర గాయాల పాలయ్యాడు. హాస్పిటల్ కి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయినట్లు తెలిపారు. వాడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు తెలిపారు.

MOST READ :

మరిన్ని వార్తలు