District collector : ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. కీలక సూచన..!
District collector : ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. కీలక సూచన..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని గురువారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. దాదాపు గంటల పాటు కలెక్టర్ ఆసుపత్రిలోని అన్ని వార్డులను కలియ తిరిగి పరిశీలించారు. ముందుగా ఆస్పత్రిలోని పీపీ యూనిట్ కి వెళ్లి ఏ ఎన్ సి రిజిస్ట్రేషన్, వాక్సినేషన్ గురించి మెడికల్ అధికారి బాలాజీ ని అడిగి తెలుసుకున్నారు.
బ్లడ్ బ్యాంక్ లో నిల్వ ఉన్న రక్త నిల్వల రిజిస్టర్లను పరిశీలించి, బ్లడ్ బ్యాంకులో ఎంతమంది పనిచేస్తున్నారని ఆరా తీశారు. ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన బ్లడ్ ప్యాకెట్లను చూసి, ఏ ఏ బ్లడ్ గ్రూప్ రక్తం అందుబాటులో ఉందని అడిగి తెలుసుకున్నారు. కాల పరిమితి దాటిన వాటిని ఉపయోగించ వద్దని ఆదేశించారు. ప్లేట్ లెట్ల ప్యాకెట్లను పరిశీలించారు.
సింగిల్ డోనర్ ప్లేట్ లెట్స్ తీసే విభాగంలో యంత్రాన్ని చూసి పని చేస్తుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఔట్ పేషంట్ విభాగంలో రోజుకు ఎంతమంది రోగులు వస్తుంటారని కంప్యూటర్ లో రోగుల పేర్లను చూశారు. ఇన్ వార్డుకి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలు ఎలా అందుతున్నాయని ఆరా తీశారు.
బెడ్లపై దుప్పట్లను ఎప్పటికప్పుడు మార్చాలని అక్కడి సిబ్బందికి సూచించారు. వార్డులను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పై అంతస్తు భవనంలో కొత్తగా ఏర్పాటు చేసిన వార్డును, ఎక్స్ రే, ఐసిటిసి విభాగాన్ని పరిశీలించారు. వెనక వైపు గల మెటర్నటి వార్డు, ఆపరేషన్ థియేటర్, సీ సెక్షన్ వార్డు, ఆర్థోపెడిక్, సర్జికల్ వార్డు, జనరల్ వార్డును పరిశీలించారు.
చివరగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ సౌభాగ్య లక్ష్మి, డాక్టర్ మల్లికార్జున్, డాక్టర్ మోహన్, ఇతర అధికారులతో కలెక్టర్ సమీక్ష జరిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా నారాయణ పేట మెడికల్ కళాశాల, జిల్లా ఆసుపత్రిని సందర్శించినప్పుడు జిల్లా ఆసుపత్రిలోని 8 విభాగాలను మెడికల్ కళాశాల కింద అంతస్తులోకి మార్చే విషయంపై చర్చించారు.
అయితే ఆసుపత్రి పూర్తిగా శిథిలావస్థకు చేరిందని, ఎప్పుడు ఎవరిపై పడుతుందోనని భయాందోళన పరిస్థితి నెలకొందని, ఆస్పత్రి భవనం మరమ్మతు పనులు చేసే వరకు మెడికల్ ఆసుపత్రిలోనే అన్ని విభాగాలను మార్పు చేసి ఇక్కడ మాత్రం ఏం సీ హెచ్ ( మదర్ అండ్ చైల్డ్ హెల్త్) విభాగాన్ని కొనసాగించాలని వైద్యులు మోహన్, మల్లికార్జున్ కలెక్టర్ కు విన్నవించారు. స్పందించిన కలెక్టర్ ముందుగా ఆరోగ్య శాఖ కార్యదర్శి ఆదేశాలను అమలు చేయాలని, మరమ్మ తు పనులకు ప్రతిపాదనలు తయారుచేసి పంపించాలని సూచించారు.
అయితే మెడికల్ కళాశాల పర్యవేక్షణలోనే ఆసుపత్రి నడుస్తోందని, ఇంకా టెకెన్ ఓవర్ కాలేదనే విషయాన్ని వైద్యులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అన్ని అంశాలతో ఒక నివేదిక తయారు చేసి ఇవ్వాలని సందర్భంగా కలెక్టర్ వైద్యులను ఆదేశించారు. అంతకు ముందు మండలంలోని అప్పక్ పల్లి వద్ద గల ప్రభుత్వ వైద్య కళాశాలను కలెక్టర్ పరిశీలించారు.
MOST READ :
-
Miryalaguda : రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. మొబైల్ ద్వారా నగదు రహిత రైల్వే టికెట్..!
-
Miryalaguda : సక్రమంగా లేని ఉపాధి హామీ రికార్డులు.. పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లకు జరిమానా..!
-
Phone Pe : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లు జాగ్రత్త.. ఆ ఫీచర్ ఆఫ్ చేయకుంటే మీ ఖాతా ఖాళీ.. అందరు తెలుసుకోవాల్సిందే..!
-
UPI : ఫిబ్రవరి 1 నుంచి ఆ యూపీఐ లావాదేవీల నిలిపివేత.. ఫోన్ పే, జి పే వినియోగదారులు తెలుసుకోవల్సిందే..!









