Friends : అనాధలైన స్నేహితుడి పిల్లలను ఆదుకున్న పూర్వ విద్యార్థులు..!
Friends : అనాధలైన స్నేహితుడి పిల్లలను ఆదుకున్న పూర్వ విద్యార్థులు..!
మాడ్గులపల్లి, మన సాక్షి :
తమ తోటి చదువుకున్న స్నేహితుడు చనిపోయాడు.. అంతకుముందే అతని భార్య చనిపోవడంతో ముగ్గురు పిల్లలు అనాధలయ్యారు. వారిని ఆదుకునేందుకు పూర్వ విద్యార్థులు అంతా ఒకటయ్యారు. వారికి చేదోడు వాదోడుగా నిలిచి ఆర్థిక సహాయంతో పాటు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మాడుగుల పల్లి మండలంలోని పాములపాడు గ్రామంలో చోటుచేసుకుంది.
మాడుగులపల్లి మండలం పాములపాడు గ్రామానికి చెందిన దాసరి నాగరాజు కొద్ది రోజుల క్రితం మృతి చెందాడు. ఏడు సంవత్సరాల క్రితం భార్య చనిపోవడంతో పిల్లల యోగక్షేమాలు అన్ని తానై చూసుకున్నాడు.
నాగరాజు కి ముగ్గురు సంతానం. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. తల్లి తండ్రులు ఇద్దరినీ కోల్పోవడంతో అనాధలుగా మారిన పిల్లలను నాగరాజు తో చదివిన టెన్త్ క్లాస్ బ్యాచ్ (2006) ముందుకొచ్చి వారికి ఆర్థిక సహాయంగా 57 వేల రూపాయలు ఆడపిల్లల పేరు మీద జమ చేసి వారికి అండగా నిలబడ్డారు.
వారి చదువులకు ఎలాంటి సహాయం ఉన్నా చేస్తామని పిల్లలకు భరోసా ఇచ్చారు. ప్రస్తుతం పిల్లలు నానమ్మ దుర్గమ్మ సంరక్షణ లో ఉన్నారు. సహాయం అందజేసిన వారిలో నాగరాజు స్నేహితులు చిట్యాల సైదులు, బంటు వెంకటేష్, సంపత్, నాగరాజు, నాగయ్య, వెంకటేష్, అశోక్, గద్దల సైదులు, సైదులు, వెంకటేశ్వర్లు, సైదులు, వెంకన్న ఉపేంద్ర చారీ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి :
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్లపై జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!
-
TG News : తెలంగాణలో విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్..!
-
Cm Revanth Reddy : 12 ఏళ్లు అద్దె ఇంట్లో గడిపిన రేవంత్ రెడ్డి.. అ ఇంటికి వెళ్లి భావోద్వేగం..!
-
TG News : రాష్ట్రంలో కొత్త పథకానికి శ్రీకారం.. రూ.2 లక్షల రుణం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే లో నేటి నుంచి యూపీఐ కొత్త రూల్స్.. మీ ఖాతాలలో డబ్బులు బ్లాక్..!









