Annadata Sukhibhava : రైతుల ఖాతాలలో డబ్బులు ఎప్పుడంటే.. లేటెస్ట్ అప్డేట్..!
Annadata Sukhibhava : రైతుల ఖాతాలలో డబ్బులు ఎప్పుడంటే.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి , అమరావతి :
రైతులకు పంట పెట్టుబడికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అందజేసే అన్నదాత సుఖీభవ పథకం నిధులు రైతుల ఖాతాలలో జమ కానున్నాయి. జూన్ 20వ తేదీ న వంట పెట్టుబడి నిధులు జమ అవుతాయని భావించినప్పటికీ నరేంద్ర మోడీ సర్కార్ అందజేసే పిఎం కిసాన్ డబ్బులు ఆలస్యం అవుతున్నందుకు అన్నదాత సుఖీభవ పంట పెట్టుబడి సహాయం డబ్బులు కూడా ఆలస్యమయ్యాయి.
ఇదిలా ఉండగా రైతులకు వానాకాలం పంట సీజన్ కు ముందే అన్నదాత సుఖీభవ డబ్బులు వారి ఖాతాలలో వేసేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ సిద్ధమైంది. జూలై మొదటి వారంలో నేరుగా రైతుల ఖాతాలలో డబ్బులను జమ చేయనున్నారు.
ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఒక్కొక్క రైతుకు 14 వేల రూపాయలను, పీఎం కిసాన్ పథకం ద్వారా మోడీ సర్కార్ 6000 రూపాయలను అందజేస్తుంది. మొత్తంగా పంట పెట్టుబడి సహాయం రైతుల ఖాతాలలో ఏడాదికి 20వేల రూపాయలను మూడు విడతలుగా జమ చేయనున్నారు. జూలై మొదటి వారంలో ఒక విడత డబ్బులు రైతుల ఖాతాలలో జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ఈ వార్తలు కూడా చదవండి:
-
Gold Price : మరోసారి గొప్ప కూలిన గోల్డ్.. భారీగా దిగి వచ్చిన బంగారం..!
-
Drinking water : ఈ ప్రాంతంలోని 245 గ్రామాలు, 3 మున్సిపాలిటీలలో 36 గంటలు త్రాగునీరు బంద్..!
-
Uttarakhand : అలకనంద నదిలో బస్సు బోల్తా.. 10 మంది గల్లంతు..!
-
Fact Check : ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ..!









