Breaking Newsకరీంనగర్జిల్లా వార్తలుతెలంగాణరాజకీయం

Bandi Sanjay : లాఠీచార్జ్ లో  గాయపడిన వారిని పరామర్శించిన కేంద్రం మంత్రి బండి సంజయ్..!

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కరీంనగర్ జిల్లా పరిషత్ వద్ద పోలీసులు జరిపిన లాఠీఛార్జిలో తీవ్రంగా గాయపడి న బిజెపి నేత, సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ ను కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ పరామర్శించారు.

Bandi Sanjay : లాఠీచార్జ్ లో  గాయపడిన వారిని పరామర్శించిన కేంద్రం మంత్రి బండి సంజయ్..!

కరీంనగర్,  మనసాక్షి :

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కరీంనగర్ జిల్లా పరిషత్ వద్ద పోలీసులు జరిపిన లాఠీఛార్జిలో తీవ్రంగా గాయపడి న బిజెపి నేత, సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ ను కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ పరామర్శించారు.

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బిఆర్ఎస్ నేతలు 58 డివిజన్ లో దొంగ ఓట్లు వేయిస్తున్నారనే సమాచారం మేరకు కరీంనగర్ జిల్లా పరిషత్ పోలింగ్ కేంద్రానికి బిజెపి నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లిన నేపథ్యంలో పోలీసులు జరిపిన విచక్షణ రహిత లాఠీ చార్జీలో బిజెపి రాష్ట్ర నాయకులు, గునుకుల కొండాపూర్ సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ మోచేయి, కాలు కు తీవ్ర గాయాలయ్యాయి.

తీవ్ర గాయాలపాలై కరీంనగర్లోని కార్తికేయ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న అజయ్ వర్మను కేంద్ర మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి బండి సంజయ్ వైద్యులతో మాట్లాడి అజయ్ వర్మ కు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

MOST READ 

  1. Miryalaguda : మిర్యాలగూడలో బీఆర్ఎస్ కార్యకర్తపై దాడి.. పరామర్శించిన నేతలు..!

  2. District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాల పరిశీలన..!

  3. నిజాయితీ చాటుకున్న 108 సిబ్బంది.. క్షతగాత్రుల రూ.1.50 లక్షల నగదు అందజేత..!

మరిన్ని వార్తలు