Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య

SSC : పది లో మాతృశ్రీ పాఠశాలలో 100 శాతం ఉత్తీర్ణత..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో చింతపల్లి మండల కేంద్రంలోని స్థానిక మాతృశ్రీ ఉన్నత పాఠశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించినట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ అంజన్ గౌడ్ పేర్కొన్నారు.

SSC : పది లో మాతృశ్రీ పాఠశాలలో 100 శాతం ఉత్తీర్ణత..!

చింతపల్లి, మనసాక్షి :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో చింతపల్లి మండల కేంద్రంలోని స్థానిక మాతృశ్రీ ఉన్నత పాఠశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించినట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ అంజన్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం వారు విలేకరులతో మాట్లాడుతూ 20 26 సంవత్సరానికి గారు మా పాఠశాల నుండి 71 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షకు హాజరయ్యారు.

అందులో 575 నుండి 500 మార్కుల వరకు 37 మంది విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. అదేవిధంగా 499 మార్కుల నుండి 416 మార్కుల వరకు మరో 34 మంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి 100% పాఠశాల నుండి విజయకేతనం ఎగరవేశారు. ఈ సందర్భంగా ఉత్త పర్యాకుల సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు వారి తల్లిదండ్రులకు అధ్యాపక బృందానికి ప్రత్యేక కృతజ్ఞత అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా వారు గత 10 సంవత్సరాల నుండి మా పాఠశాలలో వందకు వంద శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తూ పాఠశాలకు, వారి తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకొస్తున్నారు అన్నారు.

ALSO READ : 

మరిన్ని వార్తలు