గోద్రేజ్ ఫౌండేషన్ సరికొత్త మైలురాయి.. వెనుకబడిన విద్యార్థుల కోసం ‘టుమారో మేకర్స్’ ప్లాట్ఫారమ్ ప్రారంభం
దేశంలోని ప్రతిభావంతులైన యువతకు సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా స్వతంత్ర దాతృత్వ సంస్థ 'గోద్రేజ్ ఫౌండేషన్' జాతీయ స్థాయిలో 'టుమారో మేకర్స్' (Tomorrow Makers) అనే సరికొత్త ప్లాట్ఫారమ్ను ప్రారంభించింది.

దేశంలోని ప్రతిభావంతులైన యువతకు సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా స్వతంత్ర దాతృత్వ సంస్థ ‘గోద్రేజ్ ఫౌండేషన్’ జాతీయ స్థాయిలో ‘టుమారో మేకర్స్’ (Tomorrow Makers) అనే సరికొత్త ప్లాట్ఫారమ్ను ప్రారంభించింది. ముఖ్యంగా వెనుకబడిన కుటుంబ నేపథ్యాల నుండి వచ్చిన విద్యార్థులను గుర్తించి, వారిలోని నైపుణ్యాలను వెలికితీసేందుకు ఈ వేదికను రూపకల్పన చేశారు. దేశవ్యాప్తంగా ప్రతిభ అందరిలోనూ సమానంగా ఉన్నప్పటికీ, సరైన అవకాశాలు మెంటార్షిప్ అందరికీ దక్కడం లేదనే ఉద్దేశంతో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ ప్లాట్ఫారమ్ ద్వారా 6 నుండి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులతో పాటు డిగ్రీ పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లను కూడా ఎంపిక చేస్తారు. వారు తమ రంగాలలో రాణించడానికి అవసరమైన ప్రముఖ సంస్థలు, నిపుణులైన అధ్యాపకులు, మెంటార్లు తోటి విద్యార్థుల కమ్యూనిటీలతో ఈ వేదిక అనుసంధానిస్తుంది.
నాలుగు ప్రత్యేక రంగాలు – ఎనిమిది భాగస్వామ్య సంస్థలు
టుమారో మేకర్స్ కార్యక్రమం మొత్తం 4 కీలక రంగాలలో విద్యార్థులకు మార్గదర్శకత్వం వహిస్తోంది. ఇందులో సైన్స్ అండ్ టెక్నాలజీ (STEM), ఇన్వెన్షన్ అండ్ మేకింగ్ (ఆవిష్కరణలు), ఆర్ట్స్ (కళలు), డిఫెన్స్ (రక్షణ రంగం) ఉన్నాయి. ఈ శిక్షణను విద్యార్థులకు ఉచితంగా అందించేందుకు గోద్రేజ్ ఫౌండేషన్ 8 ప్రసిద్ధ భాగస్వామ్య సంస్థలతో నెట్వర్క్ను ఏర్పాటు చేసుకుంది.
STEM ప్రవేశ పరీక్షల కోచింగ్: ‘దక్షణా’ (Dakshana) ‘అవంతి ఫెలోస్’ (Avanti Fellows) సంస్థల ద్వారా అర్హులైన విద్యార్థులకు ఉచితంగా జేఈఈ (JEE), నీట్ (NEET) కోచింగ్ లభిస్తుంది.
అధునాతన అభ్యాసం: ‘జెన్ వైజ్’ (Genwise) ‘మేకర్ఘాట్’ (MakerGhat) సంస్థలు రోబోటిక్స్, కంప్యూటింగ్, మ్యాథమెటిక్స్ రంగాలలో అత్యాధునిక వర్క్షాప్లను నిర్వహిస్తాయి.
కళలు థియేటర్: ‘స్లామ్ అవుట్ లౌడ్’ (Slam Out Loud) ‘డ్రామా స్కూల్ ముంబై’ సంస్థల ద్వారా క్రియేటివ్ రైటింగ్, విజువల్ ఆర్ట్స్, ప్రొఫెషనల్ థియేటర్ శిక్షణ అందుతుంది.
డిఫెన్స్ కెరీర్: సాయుధ దళాలలో చేరాలని ఆశించే గ్రాడ్యుయేట్ల కోసం ‘డెల్టా స్క్వాడ్ ఫౌండేషన్’ ‘యువతేజస్’ సంస్థలు డిఫెన్స్ సర్వీస్ పరీక్షలకు ఎస్ఎస్బీ (SSB) ఇంటర్వ్యూలకు శిక్షణ ఇస్తాయి.
భారతదేశంలో పాఠశాల విద్యార్థుల జనాభా భారీగా ఉన్నప్పటికీ క్రమబద్ధమైన మెంటార్షిప్ అందరికీ అందుబాటులో లేదని గోద్రేజ్ ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒమర్ మోమిన్ తెలిపారు. విభిన్న సామాజిక-ఆర్థిక నేపథ్యాల నుండి వచ్చిన యువతను గుర్తించి వారిని తీర్చిదిద్దడం ద్వారా దేశానికి అవసరమయ్యే ఆవిష్కర్తలు, పరిశోధకులు, సైనికులు ప్రజా నాయకులను తయారు చేయడమే టుమారో మేకర్స్ ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఈ ఎంపికయ్యే గ్రూపులో ప్రతి సంవత్సరం 80% వరకు తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులకే ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు.
దరఖాస్తు ఎంపిక ప్రక్రియ
ఈ జాతీయ స్థాయి కార్యక్రమానికి అర్హులైన విద్యార్థులు ఆన్లైన్ వెబ్సైట్ లేదా వాట్సాప్ బాట్ ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
వాట్సాప్ ద్వారా: విద్యార్థులు +91 8655979118 నంబర్కు ‘Hi’ అని పంపడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించవచ్చు.
వెబ్సైట్ ద్వారా: www.tomorrow-makers.in పోర్టల్ను సందర్శించి వివరాలను నమోదు చేసుకోవచ్చు.
విజయవంతంగా రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులకు ఆన్లైన్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహిస్తారు. సైన్స్, ఇన్వెన్షన్, ఆర్ట్స్ ఎండ్యూరెన్స్ విభాగాలలో వారి సహజ సామర్థ్యాన్ని గుర్తించేలా ఈ పరీక్ష ఉంటుంది. 6 7వ తరగతి విద్యార్థుల కోసం ఈ అసెస్మెంట్ తెలుగు, ఇంగ్లీష్, హిందీతో పాటు మొత్తం 11 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది. అలాగే 11 12వ తరగతి విద్యార్థులు ఈ పరీక్షను ఇంగ్లీష్ భాషలో రాయవచ్చు. ఇందులో ప్రతిభ చాటిన అభ్యర్థులను గోద్రేజ్ ఫౌండేషన్ నాన్-ప్రాఫిట్ భాగస్వామ్య సంస్థల ప్రత్యేక కార్యక్రమాల్లో చేర్చుకుని, అవసరమైన వారికి స్కాలర్షిప్లు కూడా అందజేస్తారు.








