Breaking Newsఆంధ్రప్రదేశ్వైద్యం
ఉచిత మెగా వైద్య శిబిరంను ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా
అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని జహా చేనేత నగర్ లో టిడిపి నాయకులు రఘుపతి నాయుడు సహకారముతో స్వాస్థ్య హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత మెగా వైద్య శిబిరంను ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా ప్రారంభించారు.

ఉచిత మెగా వైద్య శిబిరంను ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా
మదనపల్లి, మన సాక్షి:
అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని జహా చేనేత నగర్ లో టిడిపి నాయకులు రఘుపతి నాయుడు సహకారముతో స్వాస్థ్య హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత మెగా వైద్య శిబిరంను ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఓపి ఉచితంగా జరుగుతుంది, ప్రొసీజర్ చార్జీలు ఉండవు, ఇలాంటి గొప్ప అవకాశాన్ని ప్రజలకు అందిస్తున్న ఈ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలిపారు.ఈ ఉచిత వైద్య శిబిరంలో స్వాస్థ్య ఆసుపత్రి డాక్టర్ లు సిబ్బంది టిడిపి నాయకులు ప్రజలు పాల్గొన్నారు.









