Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsవైద్యంహైదరాబాద్

Gold Price : పసిడి ప్రియులకు షాక్.. ఒక్కరోజే రూ.8200 పెరిగింది, ఈరోజు తులం ధర..!

Gold Price : పసిడి ప్రియులకు షాక్.. ఒక్కరోజే రూ.8200 పెరిగింది, ఈరోజు తులం ధర..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

పసిడి ధరలు పైకి పోతున్నాయి. మళ్లీ తులం బంగారం 80 వేల రూపాయల మార్కు వరకు చేరనున్నదని అనిపిస్తుంది. గత నెల రోజుల క్రితం పసిడి ధరలు నేల చూపులు చూసింది. కానీ ఇటీవల వారం రోజుల నుంచి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

మంగళవారం (డిసెంబర్ 10) ఒక్కరోజే 100 గ్రాముల 24 క్యారెట్స్ తులం బంగారం రూ. 8200 పెరిగింది. పసిడి ప్రియులకు షాక్ ఇచ్చింది. మరింత తగ్గుతుందనుకున్న మహిళలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

సోమవారం 24 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం కు 7,77, 800 రూపాయలు ఉండగా 8200 పెరిగి మంగళవారం 7,86,000 ఉంది. 22 క్యారెట్స్ 100 గ్రాములకు సోమవారం 7,13,000 ఉండగా 7500 పెరిగి 7,20,500గా ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న బంగారం ధరలే రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రధాన పట్టణాల్లో ఇవే ధరలు ఉన్నాయి.

హైదరాబాదులో పసిడి ధరలు (డిసెంబర్ 10)

24 క్యారెట్స్

1 గ్రాము 7860 రూపాయలు

8 గ్రాములు 62 880 రూపాయలు

10 గ్రాములు 78 600 రూపాయలు

100 గ్రాములు 7,86,000 రూపాయలు

22 క్యారెట్స్

1 గ్రాము 7205 రూపాయలు

8 గ్రాములు 57,640

10 గ్రాములు 72,050 రూపాయలు

100 గ్రాములు 7,20,500 రూపాయలు ఉంది.

MOST READ : 

మరిన్ని వార్తలు