Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

District collector : జిల్లా కలెక్టర్ సాహసం.. ఓ మహిళ ధరఖాస్తుకు స్పందించి చెంచువాని తండాలో పర్యటన..!

District collector : జిల్లా కలెక్టర్ సాహసం.. ఓ మహిళ ధరఖాస్తుకు స్పందించి చెంచువాని తండాలో పర్యటన..!

నల్లగొండ, మన సాక్షి:

నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సాహసం చేశారు. ఏ జిల్లా కలెక్టర్ కూడా చేయని సాహసం ఆమె చేశారు. అనేక సమస్యలు ఎదుర్కొంటున్న చెంచువాని తండాలో ఆమె పర్యటించి.. వెంటనే అక్కడి సమస్యలను పరిష్కరించారు.

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సీరియస్ గా ప్రజాల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఇంతలో నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం నెల్లికల్ చెంచు వాని తండా కు చెందిన ఆదెమ్మ
ఒక పిటీషన్ ను జిల్లా కలెక్టర్ కు సమర్పించింది.

అందులో ప్రధానంగా తమ తండాలో ఆధార్ కార్డులు, వివిధ ధ్రువపత్రాలు లేనందున తమ తాండవాసులందరూ ప్రభుత్వ పథకాలు అందుకోలేకపోతున్నామని, మారుమూల గిరిజన ప్రాంతంలో ఉండే తమకు ప్రభుత్వ లబ్ధి అందటం లేదని ఉంది..

ఈ విషయాన్ని సావధానంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఒక చెంచు మహిళ సుదూర ప్రాంతం నుండి నల్గొండకు వచ్చి సమస్యలను చెప్పడంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి నేరుగా నెల్లికల్ చెంచు వాని తండాకే వెళ్లి చెంచు తండావాసుల సమస్యలు పరిష్కరించాలని నిర్ణయించారు.

వెంటనే నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డితో కలిసి శుక్రవారం ఉదయం 8 గంటలకే జిల్లా కలెక్టర్ , జిల్లా అధికారులతో సహా చెంచుతాండకి చేరుకున్నారు. ఉదయమే తమ తండా కు వచ్చిన జిల్లా కలెక్టర్ , ఎం ఎల్ ఏ లను చూసి చెంచు ప్రజలు సంతోషం తో స్వాగతం పాలికారు.

చెంచు వాని తాండ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి జిల్లా కలెక్టర్ సావధానంగా విన్నారు. అంతేకాక సమస్యల పరిష్కారానికి సైతం మార్గాలు సూచించారు.

తమ తండాలో కొంతమందికి ఆధార్ కార్డులు లేవని , ఆధార్ కార్డులు ఉన్నవారికి అప్డేషన్ లేనందున తాము ఎలాంటి పథకాలకి అర్హులం కాకుండా పోయామని, తాగునీటి బోరు మరమ్మతు చేయించాలని, పిల్లలు ఎక్కువగా ఉన్న వారికి ప్రభుత్వం ఇస్తున్న 6 కేజీల బియ్యం సరిపోవడం లేదని , అంత్యోదయ అన్న యోజన కింద 32 కిలోల బియ్యం ఇవ్వాలని తెలిపారు.

ALSO READ Miryalaguda : డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. నకిలీ బంగారం విక్రయిస్తున్న లీడర్ అరెస్ట్..!

కొంతమందికి రేషన్ కార్డులు లేవని, పెండింగ్లో ఉన్నాయని, కొందరికి ఉపాధి హామీ జాబ్ కార్డులు లేవని, తమ చెంచుల నుండే ఆశ, అంగన్వాడి, ఏఎన్ఎం లాంటి వారిని నియమించాలని, ఎలాంటి నెట్ వర్క్ లేనందున అత్యవసర సమయాలలో సమాచారం చేరవేయడం కష్టంగా ఉందని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో వారి శాఖల ద్వారా అమలు చేసే పథకాల గురించి ముందుగా చెంచులకు వివరించే ఏర్పాటు చేశారు.

డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, గృహనిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్ ,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రమేష్, పంచాయతీరాజ్, అటవీ శాఖల ద్వారా చెంచుల కోసం అమలు చేసే పథకాలను కులంకషంగా చెంచులకు వివరించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సరైన ధ్రువపత్రాలు లేకుంటే ముఖ్యంగా ఆధార్, అప్డేషన్, కులము, పుట్టిన తేదీ ధ్రువపత్రాల వంటివి లేని కారణంగా నెల్లికల్ చెంచు వాని తాండ చెంచులు ప్రభుత్వ పథకాలను అందుకోలేకపోతున్నారని తాండకు చెందిన ఆదెమ్మ ప్రజావాణిలో తన దృష్టికి తీసుకొచ్చిందని, సమస్యల పరిష్కారానికి చెంచులు నల్గొండకు వచ్చి
ఇబ్బందులు ఎదుర్కోకూడదన్న ఉద్దేశంతో జిల్లా అధికారులందరిని తీసుకొని తానే శాసన సభ్యులతో సహా చెంచు తాండకు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.

ALSO READ : TG News : కేటీఆర్ కు బిగ్ షాక్.. ఫార్ములా ఈ కేసులో విచారణకు గవర్నర్ అనుమతి..!

అన్ని దృవపత్రాలు ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని, అందులో ఆధార్ ముఖ్యమని, ప్రతి పథకానికి ఆధార్ అనుసంధానం అవసరం ఉంటుందని, ముఖ్యంగా పెన్షన్లు పొందేవారు మూడు నెలలకు మించి పెన్షన్ తీసుకోకుండా ఉండకూడదని, అలాగే భూమి సాగు చేసుకుంటున్న వారు భూమిని వదిలేసి వెళ్లకుండా నిరంతరం సాగు చేసుకుంటూ ఉండాలని అన్నారు.

అలాగే కొత్తగా అటవీ భూముల సాగు చేయొద్దని, ప్రభుత్వం అన్ని రకాల పథకాలను అమలు చేస్తుందని, చెంచులు ప్రభుత్వం అమలు చేసే వివిధ పథకాలను సద్విని చేసుకోవాలని, చెంచుతాండలో ఉన్న ఖాళీలన్నింటిని భర్తీ చేస్తామని, ఉపాధి హామీ కింద జాబ్ కార్డులు ఇవ్వడంతో పాటు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

పెన్షన్లు లేనివారు పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని, ఆడ శిశువుల విక్రయాలు, బాల్య వివాహాల వంటి దూరాచారాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్య సేవలకు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళవద్దని, ప్రభుత్వాసుపత్రిలోనే వైద్యం చేయించుకోవాలని, రోగం ముదిరాక ప్రభుత్వ ఆసుపత్రులకు రాకుండా ముందే రావాలని, తిరుమలగిరి సాగర్ లోనే డాక్టర్, గ్రామంలోనే ఆశ, అంగన్ వాడి ఉంటారని వారి సేవలను ఉపయోగించుకోవాలని చెప్పారు.

తాండవాసులు కోరినట్లుగా తక్షణమే కమ్యూనికేషన్ కోసం ఎయిర్టెల్, లేదా బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సేవలను ఏర్పాటు చేస్తామని, తండాలో గ్రామపంచాయతీ భవనం, అంగన్వాడి కేంద్రం ఇతర ప్రభుత్వ సంస్థలకు సంబంధించి భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, తాండ వాసులందరికీ శాశ్వత ఆధార్ కార్డులు ఇవ్వడమే కాకుండా, ఇదివరకే ఉన్న కార్డులలో తప్పులు ఉంటే సరి చేస్తామని తెలిపారు.

నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లికల్ చెంచు తండా ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పరిష్కరించేందుకు అధికారులు చెంచు తాండకే రావడం సంతోషమని, చెంచులకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించాలని కోరారు.

ALSO READ : ACB : లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన సర్వేయర్..!

మిర్యాలగూడ సబ్ కలెక్టర్, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ మాట్లాడుతూ నెల్లికల్ చెంచు తండా ప్రజల సమస్యలను తీర్చేందుకు ప్రత్యేకించి ఆధార్, మీ-సేవ అప్డేషన్స్ ,ఆధార్ కార్డు లేని వారికి ఆధార్ ఇవ్వడం వంటి సమస్యల పరిష్కారానికి అధికారులందరితో తాండకు రావడం జరిగిందని తెలిపారు.

ఈ సందర్భంగా తండాలో 72 మంది ఆధార్ అప్డేషన్ చేయగా 21 మందికి కొత్త ఆధార్ కార్డులను ఇస్తున్నట్లు తెలిపారు. ఆధార్, మీసేవ, ఇతర సేవలకు సంబంధించిన శిబిరాన్ని ప్రారంభించారు.

MOST READ : 

  1. Good News : మీకు రేషన్ కార్డు ఉందా.. ఉచిత రేషన్ బియ్యం ఎప్పటి వరకంటే..!

  2. District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ధాన్యం కొనుగోలు సెంటర్ల ఆకస్మిక తనిఖీ..!

  3. Nagarjuna Sagar : నాగార్జునసాగర్ టు శ్రీశైలం లాంచ్ ప్రయాణం.. టికెట్ రేట్లు ఇవీ..!

  4. TG News : కారుకు సైడ్ ఇవ్వలేదని తండ్రి వయసున్న ఆర్టీసీ డ్రైవర్ పై కాలితో తన్ని దాడి.. (వీడియో వైరల్)

మరిన్ని వార్తలు