Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లారాజకీయంసూర్యాపేట జిల్లా
భువనగిరి ఎం పి అభ్యర్థి గా చామల కిరణ్ కుమార్ రెడ్డి దరఖాస్తు..!
భువనగిరి ఎం పి అభ్యర్థి గా చామల కిరణ్ కుమార్ రెడ్డి దరఖాస్తు..!
సూర్యాపేట , మన సాక్షి:
కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిత్వంను టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గురువారం గాంధీ భవన్ లొ పార్టీ పరిశీలకులకు అందజేశారు.
భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషిచేస్తున్న తనకు అవకాశం కల్పించాలని కోరుతూ చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ అధిష్టానం కు విన్నవించారు.
భువనగిరి పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల నుండి భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులతో కలిసి పార్టీ పరిశీలకులకు దరఖాస్తును అందజేశారు.
ALSO READ : KTR : మన కేటీఆర్ ఇలా అయ్యాడా.. ఏంటో ఆ కథ తెలుసుకోండి.. నెట్టింట్లో వైరల్..!









