Big Shock : మరోసారి పెరిగిన పెట్రోల్, డిజిల్ ధరలు.. నేటి నుంచే అమలు, లీటర్ ఎంతంటే..!
దేశంలో ఇందన ధరలు మరోసారి పెరిగాయి. సామాన్యుడిపై మరోసారి భారం పడింది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి.

Big Shock : మరోసారి పెరిగిన పెట్రోల్, డిజిల్ ధరలు.. నేటి నుంచే అమలు, లీటర్ ఎంతంటే..!
మన సాక్షి : వెబ్ డెస్క్ :
దేశంలో ఇందన ధరలు మరోసారి పెరిగాయి. సామాన్యుడిపై మరోసారి భారం పడింది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి.
ఇప్పటివరకు నెలరోజుల కాలంలోనే నాలుగు పర్యాయాలు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి సామాన్యులకు మరింత భారంగా మారాయి. ప్రస్తుత సవరణల ప్రకారం లీటర్ పెట్రోల్ పై రూ.2.84, లీటర్ డీజిల్ పై రూ. 2.86 ల చొప్పున ధర పెరిగింది. నాలుగు విడతలుగా కలుపుకొని ఇప్పటివరకు సుమారుగా లీటర్ కు ఎనిమిది రూపాయల మేర పెరిగింది.
ధరల పెంపుతో తాజా గా తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డిజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే.. రికార్డు స్థాయి లో పెరిగాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 115.73, లీటర్ డిజిల్ ధర రూ. 103.73 ఉంది. ఆంధ్రప్రదేశ్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 117.75, లీటర్ డిజిల్ ధర రూ. 105.43 గా ఉంది. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్ స్థిర పడకుంటే ధరలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.









