Marigolds : విరగబూసిన బంతిపూలు.. ఐనా రైతుల దిగాలు..!
Marigolds : విరగబూసిన బంతిపూలు.. ఐనా రైతుల దిగాలు..!
రామసముద్రం, మనసాక్షి:
అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలోని బంతి పూలు వేసిన రైతులకు ధరలు లేక వారంరోజులు గా తగ్గుముఖం పట్టడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత వారం క్రితం కిలో బంతి ధరలు 60/70 రూపాయలు పలికేవి. ఇప్పుడు ఒక బస్తా బంతి పూలు 100రూపాయలు పలుకుతున్నాయి.
ఒక కిలో బంతి 5-6 రూపాయలు పలకడం తో రైతులు దిగులు చెందుతున్నారు. మండలంలోని పలు పంచాయతీ లలో తిరుమలరెడ్డిపల్లె , ఊలపాడు. చీర్లపల్లె, మచ్చు వారిపల్లె, నారిగానిపల్లె చొక్కాండ్లపల్లె, ఆర్ నడింపల్లె, మినికి చెంబకూరు, నారిగానిపల్లె, కాప్పల్లె పంచాయతీ లలో అధికంగా బంతి పూలు సాగు చేస్తారు.
ప్రభుత్వం స్పందించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. ప్రకృతిని నమ్ముకొని భూమిపై ఆధారపడి ఒక పంట పోతే మరో పంట వస్తు ధన్న ఆశతో పూల పంట వేసి దిగుబడి బాగా వచ్చిన పంటకు గిట్టుబాటు ధర లేదు. చేసిన అప్పులు తీర్చలేక అప్పులు పాలైన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
(Reporting : Venu Raju, ManaSakshi)
(Ramasamudram, AP)
MOST READ :
-
Viral Video : లవ్ రెడ్డి సినిమా చూసి ప్రేక్షకురాలు ఎమోషన్.. నటుడు NT రామస్వామి పై థియేటర్ లోనే మహిళ దాడి.. ( వీడియో)
-
Phonepe, Gpay : ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి అదిరిపోయే శుభవార్త.. ఇది అస్సలు మిస్ చేసుకోకండి..!
-
Miryalaguda : దోమకాటుకు పురుగు మందు చల్లితే.. ఉన్న పొలం ఎండిపోయింది, రైతు కుటుంబం ధర్నా..!
-
Viral Video : నేను నిన్ను కొట్టను కానీ.. ఆ టీచర్ రహస్యం, అలా బయటపడింది.. (వీడియో)









