TOP STORIESBreaking Newsతెలంగాణరాజకీయం
TG News : స్థానిక సంస్థల ఎన్నికలపై క్లారిటీ..!
TG News : స్థానిక సంస్థల ఎన్నికలపై క్లారిటీ..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై క్లారిటీ రానున్నది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ మంత్రి మండలి సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చించనున్నారు.
సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరిపై నిర్మిస్తున్న బనకచర్లపై ఏం చేద్దామనే విషయంపై ప్రధానంగా చర్చిస్తారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ ప్రధానంగా కొనసాగుతుంది.
జూలైలో ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మంత్రి మండలి సమావేశం అనంతరం కీలకాంశాలు చర్చించనున్నారు.
దాంతో పాటు ఆర్ఆర్ఆర్ (రీజినల్ రింగ్ రోడ్డు) గురించి చర్చించనున్నారు. మంత్రి మండలి సమావేశంలో తొలిసారిగా కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వివేక్, వాకిటి, అడ్లూరు హాజరుకానున్నారు.









