Garidepally : కారుపై పడిన కరెంటు స్తంభం..!
గరిడేపల్లి మండల పరిధిలోని కొండాయిగూడెం– పరెడ్డిగూడెం మధ్య రహదారి నిర్మాణం సాంక్షన్ అయినప్పటికీ పూర్తి స్థాయిలో పనులు చేయకుండా కేవలం కంకర పోసి వదిలేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Garidepally : కారుపై పడిన కరెంటు స్తంభం..!
గరిడేపల్లి, మన సాక్షి :
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని కొండాయిగూడెం– పరెడ్డిగూడెం మధ్య రహదారి నిర్మాణం సాంక్షన్ అయినప్పటికీ పూర్తి స్థాయిలో పనులు చేయకుండా కేవలం కంకర పోసి వదిలేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రహదారిపై వాహనాలు తరచుగా స్కిడ్ అవుతూ ప్రమాదాలకు గురవుతున్నాయి.
శుక్రవారం మధ్యాహ్నం కొండాయిగూడెంకు చెందిన కేతిరెడ్డి వీరారెడ్డి (ప్రస్తుతం ఎల్బీనగర్ నివాసం) ఒక కుటుంబ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా, ఆయన ప్రయాణిస్తున్న కారు కంకర రహదారిపై స్కిడ్ అయి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో కరెంట్ పోల్ విరిగి కారుపై పడింది.
అయితే అదృష్టవశాత్తు కారులో ఉన్న వ్యక్తికి ఎలాంటి ప్రాణాపాయం జరగకపోగా, కారు స్వల్పంగా దెబ్బతిన్నది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారి పనులను పూర్తిచేసి, ప్రయాణికుల భద్రతకు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- TG News : రైతులకు గుడ్ న్యూస్.. వారికి ఎకరానికి రూ. 50వేల రాయితీ..!
- Pink Coffee : పింక్ కాఫీ మహిళల పాలిట సంజీవని.. ఈ రంగు కాఫీలో దాగున్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!
- Miryalaguda : యాదాద్రి పవర్ ప్లాంట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని భారీ మోసం.. బాధితుల ఆందోళన..!
- Snakes : చూపు మందగించినా గురి తప్పని దాడి.. పాములకు ఆ అద్భుత శక్తులు ఏంటో తెలుసా..?









