Breaking Newsజిల్లా వార్తలునల్గొండవ్యవసాయం
Miryalaguda : రైతు మహోత్సవంకు భారీగా తరలి వెళ్లిన రైతులు..!
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కోహెడ గ్రామంలో జరగనున్న రైతు మహోత్సవం కార్యక్రమానికి మిర్యాలగూడ నుంచి భారీగా రైతులు తరలి వెళ్లారు.

Miryalaguda : రైతు మహోత్సవంకు భారీగా తరలి వెళ్లిన రైతులు..!
మిర్యాలగూడ, మనసాక్షి :
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కోహెడ గ్రామంలో జరగనున్న రైతు మహోత్సవం కార్యక్రమానికి మిర్యాలగూడ నుంచి భారీగా రైతులు తరలి వెళ్లారు. నియోజకవర్గం లోని ప్రతి క్లస్టర్ నుంచి బస్సు లలో రైతులు వెళ్లారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి జెండా ఊపి ప్రాంభించారు. మిర్యాలగూడ, దామెరచర్ల మండలం నుండి 8 బస్సులు వెళ్లాయి.
ఈ కార్యక్రమములో స్థానిక ప్రజా ప్రతినిధులు డి సి సి కార్యదర్శి బాలకృష్ణ, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి , మండల వ్యవసాయ అధికారి యం, ఋషేంద్రమణి రైతులు, ఎ ఇ ఓ లు పార్వతి, అఫ్రిన్, రమేష్, నరేష్, గోపి ఉన్నారు.









