Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయం

Paddy Centers : కాంటాలు కావు, లారీలు లేవు, కుప్పలుగా ధాన్యం .. కొనేదెప్పుడో.. ఆందోళనలో రైతులు..!

Paddy Centers : కాంటాలు కావు, లారీలు లేవు, కుప్పలుగా ధాన్యం .. కొనేదెప్పుడో.. ఆందోళనలో రైతులు..!

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో దాన్యం రాశులు కనిపిస్తున్నా యి. కొనుగోళ్లు ఆలస్యంగా కావడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షపు సూచనతో మరింత ఆందోళన చెందుతున్నారు. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలోని పలు గ్రామాలలో దాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని రైతులకు పేర్కొంటున్నారు.

సూర్యాపేట జిల్లా పెన్‌ప‌హాడ్ మండలంలోని అనంతారం, నారాయణగూడెం పీఏసీఎస్ కేంద్రాల్లో సుమారు 8,900 బస్తాలు కాంటాలు వేయ‌గా 5,980 బస్తాలు లారీల ద్వారా చింతలపాలెం శివసుభ్రమణ్యేశ్వర మిల్లు, కోదాడలోని శ్రీ వెంకటలక్ష్మి మిల్లు, ఎఫ్‌సీఐకు రవాణా చేశారు. అలాగే అనాజీపురంలో 1,355 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయగా ఇప్పటివరకు ఐదు లారీల ద్వారా ఇదే మిల్లులకు ర‌వాణా చేశారు.

ఇందులో రెండు లారీలు దిగుమతి కాలేదు. నేటికి వారం రోజులకు చేరుకుంది. లారీలు వస్తాయన్న ఆలోచనలో నిర్వాహకులు వేల బస్తాలు కాంటాలు వేయగా ట్రాన్స్‌పోర్టు కోసం ఎదురు చూస్తున్నాయి. కాంటాలు కాక ధాన్యం రాశులు కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా దర్శనం ఇస్తున్నాయి.

వ‌ర్ష సూచ‌న‌తో ఆందోళ‌న‌లో రైతులు మ‌రోప‌క్క వాతావ‌ర‌ణ శాఖ వ‌ర్ష సూచ‌నల నేప‌థ్యంలో రైతులు ఆందోళ‌న చెందుతున్నారు. ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో ఇప్ప‌టికే వంద‌ల సంఖ్య‌లో ధాన్యం రాశులు ఉన్నాయి. చినుకులు పడితే త‌డ‌వ‌కుండా ధాన్యాన్ని కాపాడుకోవ‌డం ఎట్లా, అమ్ముకోవ‌డం ఎట్లా అని రైతులు వాపోతున్నారు.

సంచులు తూకం వేసుకునే వరకే తమ పని అన్నట్లుగా వ్యవహారం తయారైంది. కొనుగోళ్ల ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక మునుముందు ఎట్లా ఉంటుందోన‌ని రైతులు ఆందోళ‌న చెందుతున్నారు.
ధాన్యం తీసుకొచ్చి 20 రోజులు అయింది. అనంతారం గ్రామంలోని పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి 20 రోజులు దాటింది.

5 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వరి సాగు చేశా. 10 రోజులు ధాన్యాన్ని బాగా ఎండబెట్టిన. ధాన్యం కాంటాలు వేసి మూడు రోజులు అవుతుంది. ఇప్పటి వరకు లారీలో లోడింగ్ కాలేదు. లారీలో బస్తాలు వేసేంత వ‌ర‌కు రైతుదే బాధ్యత అంటున్నారని అనంతారం గ్రామ రైతు గండికోట నాగ‌య్య వాపోయారు.

Reporting : NageshwarRao, Penpahad

MOST READ :

  1. Rythu Bharosa : రైతు భరోసా ఎప్పుడంటే.. మంత్రి తుమ్మల స్పష్టం.. బిగ్ అప్డేట్..!

  2. TG News : 100 ఏళ్లు పనికొచ్చేలా భూభారతి చట్టం.. జిల్లాకు ఓ మండలం పైలెట్ ప్రాజెక్టు.. మంత్రి పొంగులేటి వెల్లడి..!

  3. Gold Price : పసిడి పరుగు.. ఈరోజు తులం ఎంతో తెలుసా..!

  4. TG News : పెన్షన్ నో టెన్షన్.. పెన్షన్ దారులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్..!

  5. TGSRTC : తెలంగాణ ఆర్టీసీలో 3038 ఉద్యోగాల భర్తీ.. నోటిఫికేషన్ పై మంత్రి పొన్నం కీలక ప్రకటన..!

మరిన్ని వార్తలు