Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణమంచిర్యాల జిల్లా
వడదెబ్బ తగిలి కానిస్టేబుల్ మృతి
వడదెబ్బ తగిలి కానిస్టేబుల్ మృతి
లక్షేట్టిపేట్ , (మన సాక్షి);
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని అంకతివాడకు చెందిన ముత్తే సంతోష్ (45) అనే పోలీస్ కానిస్టేబుల్ వడదెబ్బకు గురై ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో మృతి చెందాడు.సంతోష్ రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. సొంతూరుకు వచ్చిన ఈయన వడదెబ్బ తగిలి అస్వస్థకు గురై రాత్రి ప్రాణాలు విడిచాడు.









