Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : నల్గొండ జిల్లాలో రెండు వైన్స్ లలో చోరీ..!

Nalgonda : నల్గొండ జిల్లాలో రెండు వైన్స్ లలో చోరీ..!

చింతపల్లి,  మన సాక్షి :

నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో రెండు వైన్స్ ల లో దోపిడికి పాల్పడి మద్యం బాటిల్లను ఎత్తుకు వెళ్ళిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై బి. యాదయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని దుర్గా వైన్స్, శ్రీ సాయి వైన్స్ ల లో బుధవారం అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు పైకప్పును విప్పి లోపలికి ప్రవేశించి కొంత నగదు తో పాటు మద్యం బాటిలను వెతుకు వెళ్లారు.

వీటి విలువ సుమారు రెండు వైన్స్లలో కలిపి 75 వేల రూపాయల వరకు ఉంటుందని ఎస్ఐ పేర్కొన్నారు. దుర్గా వైన్స్ క్యాషియర్ గడిగ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : 

మరిన్ని వార్తలు