ఖమ్మం : గంజాయి పై ఉక్కుపాదం..!
ఖమ్మం : గంజాయి పై ఉక్కుపాదం..!
పోలీస్, ఎక్సైజ్ శాఖల సమన్వయంతో తనీఖీలు
మద్యం దుకాణాల నుంచి ఆటోలలో మద్యం తరలిస్తే సహించం.
జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరిండెంట్ వి.వేణుగోపాల్రెడ్డి.
నేలకొండపల్లి , మన సాక్షి :
జిల్లాలో గంజాయి పై ప్రత్యేక దృష్టి సారించి నిర్మూలన కోసం కఠినం చర్యలు తీసుకుంటున్నట్లు ఖమ్మం జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ కార్యాలయం ను శుక్రవారం సందర్శించారు. దుకాణ యాజమానుల తో మద్యం లిఫ్టింగ్ గురించి అడిగి తెలుసుకున్నారు.
స్టేషన్లో పలు సూపరిండెంట్ వి. వేణుగోపాల్రెడ్డి తెలిపారు. నేలకొండపల్లి సర్కిల్ రికార్డులను పరిశీలించారు. అనంతరం మండలం లోని నేలకొండపల్లి, రాజేశ్వరపురం మద్యం దుకాణాలను తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు… జిల్లాలో గంజాయి విక్రయాల పై ఉక్కుపాదం మోపుతున్నట్లు హెచ్చరించారు. ఇందు కోసం పోలీస్, మరియు ఎక్సైజ్ శాఖలు సమన్వయంగా తనీఖీలు చేపడుతున్నటు తెలిపారు.
ALSO READ : Bigg Boss : బిగ్ బాస్ హిస్టరీ లోనే తొలిసారిగా.. మరోసారి మినీ గ్రాండ్ ఎంట్రీ.. ఎవరెవరు వస్తున్నారంటే..!
రాష్ట్రసరిహద్దు వల్లభి, జిల్లా సరిహద్దు మోతే వద్ద చెకో పోస్టుల వద్ద విస్తుత తనీఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సారా విక్రయాలు లేకుండా చేసినట్లు తెలిపారు. అందరి సహకారంతో సారా రహిత జిల్లా గా ఆదర్శంగా నిలుస్తున్నట్లు తెలిపారు. గంజాయి ఇతర మాదక ద్రవ్యాలు విక్రయాల గురించి తమకు సమాచారం అందించాలని కోరారు. ఎంతటి వారైనా సరే సహించేది లేదని హెచ్చరించారు.
జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 2 వేల కేజీల గంజాయి వరకు పట్టుకున్నట్లుతెలిపారు. జిల్లాలో పలు చోట్ల మద్యం దుకాణాల నుంచి ఆటోల ద్వారా మద్యం బెల్ట్ షాపులకు మద్యం ను తరలిస్తున్నట్లు ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. అలాంటి వారి పై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ విలేకర్ల సమావేశంలో నేలకొండపల్లి సీఐ కె.పోశెట్టి, టాస్క్ఫోర్స్ సీఐ విజేందర్, నేలకొండపల్లి ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.
ALSO READ :
హైదరాబాద్ : రికార్డ్ స్థాయిలో గణేష్ లడ్డు వేలంపాట.. రూ.1.26 కోట్లు, అది ఎక్కడంటే..!
Software : ఈ కోర్సులు నేర్చుకుంటే సాఫ్ట్ వేర్ ఉద్యోగం గ్యారెంటీ.. అవేంటో తెలుసుకుందాం..!
అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఆర్థికపరమైన విషయాల్లో పలు మార్పులు.. అవి ఏంటో తెలుసుకుందాం..!









