Miryalaguda : తెలంగాణలోనే మిర్యాలగూడను మొదటి స్థానంలో ఉంచాలి..!
Miryalaguda : తెలంగాణలోనే మిర్యాలగూడను మొదటి స్థానంలో ఉంచాలి..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ పట్టణాన్ని స్వచ్ఛతనంగా, పచ్చదనంగా ఉంచడంలో తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా ఉంచాలని స్థానిక ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మిర్యాలగూడ మున్సిపాలిటీలో స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ తో కలిసి ఆయన ప్రారంభించారు.
స్వచ్చధనం- పచ్చదనం 5 రోజుల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయంలో ప్రారంభించి మొక్కలు నాటారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని అన్నారు. స్వచ్చధనం – పచ్చధనంలో మిర్యాలగూడ పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రం లో మొదటి స్థానంలో ఉండేలా ప్రతిఒక్కరం కృషి చేయాలని అన్నారు.
కార్యక్రమంలో కమిషనర్ యూసఫ్, కౌన్సిలర్స్ ముదిరెడ్డి నర్సిరెడ్డి, దేశిడి శేఖర్ రెడ్డి, రవి నాయక్, శాగ జలంధర్ రెడ్డి, రామకృష్ణ, కొమ్ము శ్రీనివాస్, మంత్రాల రుణాల్ రెడ్డి మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
ALSO READ :
Nagarjunasagar : నాగార్జునసాగర్ 6 గేట్లు ఎత్తి నీటి విడుదల.. కృష్ణమ్మ పరవళ్ళు.. Latest Update
Nagarjunasagar : తెరుచుకున్న సాగర్ గేట్లు.. నిండుగా కాలువలు.. పంట పొలాల్లో రైతుల సందడి..!
మిర్యాలగూడ : నాగార్జునసాగర్ మేజర్ లకు సాగునీటి విడుదల..!
మిర్యాలగూడ : టాయిలెట్స్ లేవని విద్యార్థినిలు ఎంఎల్ఏ కు మొర.. కాంట్రాక్టర్ పై ఎమ్మెల్యే ఆగ్రహం..










