Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమహబూబ్నగర్వ్యవసాయం
CM Revanth Reddy : రైతు పండుగ వేదికగా రైతులకు శుభవార్త.. స్వయంగా ప్రకటించిన సీఎం రేవంత్..!
CM Revanth Reddy : రైతు పండుగ వేదికగా రైతులకు శుభవార్త.. స్వయంగా ప్రకటించిన సీఎం రేవంత్..!
మన సాక్షి, మహబూబ్నగర్ :
తెలంగాణ రాష్ట్ర
రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి శుభవార్త తెలియజేశారు. పాలమూరు జిల్లాలో రైతు పండుగ సందర్భంగా వేదికపై నుంచి ఆయన నిధులు విడుదల చేశారు. రుణమాఫీ కానీ రైతులకు ఆయన భరోసా కల్పించారు.
రాష్ట్రవ్యాప్తంగా 3.14 లక్షల మంది రైతులకు 2747 కోట్ల రూపాయలను విడుదల చేశారు. గతంలో మూడు విడుదలగా 18 వేల కోట్ల రూపాయలను విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి 2747 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటివరకు రైతుల రుణమాఫీకి ఎంత పెద్ద మొత్తంలో చేయలేదని అది తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే దక్కిందని పేర్కొన్నారు.
MOST READ :









