TOP STORIESBreaking Newsవ్యవసాయం

TG News : రైతులకు తెలంగాణ సర్కార్ శుభవార్త.. భూ భారతితో వారికి మోక్షం..!

TG News : రైతులకు తెలంగాణ సర్కార్ శుభవార్త.. భూ భారతితో వారికి మోక్షం..!

మన సాక్షి:

తెలంగాణ సర్కార్ కొత్త చట్టం…భూ భారతి ఆర్‌ఓఆర్‌-2024తో చాలా మంది రైతులకు న్యాయం జరగనుంది. ఇప్పటి వరకు సాదాబైనామాలతో నెట్టుకొచ్చిన రైతులు. ఇప్పుడు ఆ భూములకు పట్టాదారులు కానున్నారు.

చాలా గ్రామాల్లో భూములు కొన్నప్పుడు…రైతులు కాగితంపై అమ్మకం కొనుగోలు ఒప్పందం రాసుకున్నారు. అలాంటి వారి కోసమే…రైతుల సమస్యలను పరిష్కరించేందుకు భూ భారతి ఆర్‌ఓఆర్‌-2024 చట్టాన్ని తీసుకు వచ్చింది రేవంత్‌ రెడ్డి సర్కార్‌.

ఇన్నాళ్ళు తమ భూముల రిజిస్ట్రేషన్‌ కోసం ఎమ్మార్వోల చుట్టూ తిరిగిన రైతులకు భూ భారతి ఆర్‌ఓఆర్‌-2024 చట్టంతో పరిష్కారం చూపనుంది. ఈ పనులు తొందరగా జరిగేలా…చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. భూ భారతి ఆర్‌ఓఆర్‌-2024 చట్టంతో చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్న రైతులకు…సాదాబైనామా సమస్య నుంచి పరిష్కారం దొరుకుతుందని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

Reporting : N.M.REDDY, Hyderabad

MOST READ :

మరిన్ని వార్తలు