తెలంగాణBreaking Newsజిల్లా వార్తలువికారాబాద్ జిల్లా

Cm Revanth Reddy : ఎల్లమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి..!

Cm Revanth Reddy : ఎల్లమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి..!

హైదరాబాద్, మన సాక్షి :

వికారాబాద్ జిల్లా పోలేపల్లి రేణుక ఎల్లమ్మ తల్లికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. శుక్రవారం ఆయన రేణుక ఎల్లమ్మ తల్లిని బ్రహ్మోత్సవాల సందర్భంగా దర్శించుకున్నారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అమ్మవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు తోపాటు పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.

MOST READ :

మరిన్ని వార్తలు