MLC Elections : కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీజేపీ కైవసం..!
MLC Elections : కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీజేపీ కైవసం..!
హైదరాబాద్, మన సాక్షి :
కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం బిజెపి కైవసం చేసుకుంది. ఈ స్థానం కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ స్థానం ఉండేది. బిజెపి గెలుపుతో కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం కోల్పోయింది. బిజెపి అభ్యర్థి అంజిరెడ్డి విజయకేతనం ఎగురవేశారు. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో రెండు స్థానాలను బిజెపి గెలుచుకోవడంతో బిజెపిలో జోష్ పెరిగింది. రేపు (గురువారం) బిజెపి కార్యాలయంలో సంబరాలు నిర్వహించనున్నారు.
రెండవ ప్రాధాన్యత ఓట్లతో విజయం :
కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ , నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. అంజిరెడ్డికి 78,635 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి 73,644 ఓట్లు వచ్చాయి బిఎస్పి అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 63404 ఓట్లు పడ్డాయి. దాంతో అంజిరెడ్డి విజయం ఖాయమైంది. మొత్తం 56 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా అంజి రెడ్డి, నరేందర్ రెడ్డి మినహా అందరినీ ఎలిమినేషన్ రౌండ్ లో తొలగించి వారి ఓట్లను బదలాయించారు.
MOST READ :
-
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. 134 మంది పంచాయతీ కార్యదర్శులకు చార్జ్ మెమో..!
-
Hyderabad : గాంధీలో డాక్టర్ల డుమ్మా.. మంత్రి ఆకస్మిక పర్యటనలో వెలుగులోకి, శోకాజ్ నోటీసులకు ఆదేశం..!
-
Free Sewing Machine : మహిళలకు సూపర్ గుడ్ న్యూస్.. ఉచిత కుట్టుమిషన్లకు దరఖాస్తు ఇలా..!
-
TG News : తెలంగాణలో విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్..!









