Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
BIG BREAKING : నల్గొండ జిల్లాలో మహిళ దారుణ హత్య..!
BIG BREAKING : నల్గొండ జిల్లాలో మహిళ దారుణ హత్య..!
గుర్రంపోడు, మన సాక్షి :
నల్గొండ జిల్లాలో మహిళ దారుణ హత్య జరిగిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం తెరాటి గూడెంలో ఈ సంఘటన జరిగింది. మద్యానికి బానిసైన భర్తను భార్య అరుణ (35) నిలదీసింది. ఇద్దరు మధ్య మాట పెరిగింది. ప్రతిరోజు తాగి వస్తున్నాడని భర్తతో ఆమె గొడవకు దిగింది. అయితే తనతో గొడవకు దిగుతావా అంటూ మద్యం మత్తులో ఉన్న భర్త ఆమెను గొడ్డలితో నరికి చంపినట్లు సమాచారం. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.









