Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : వాగుల వద్ద జాగ్రత్తలు పాటించాలి..!
Miryalaguda : వాగుల వద్ద జాగ్రత్తలు పాటించాలి..!
మిర్యాలగూడ, మనసాక్షి:
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ లక్ష్మయ్య సూచించారు. ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు, కాలువల వద్ద ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు.
మండలంలోని లావుడుతండా- రామన్నపేట వాగు, తడకమళ్ళ పిల్ల వాగు వద్ద వరద ఉదృతంగా ప్రవహిస్తున్నందున ప్రయాణికులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా శిథిలావస్థ ఇల్లు, చెట్ల కింద నివాసం ఉండవద్దన్నారు. ప్రజలకు ఏమైనా ఇబ్బందులు కలిగితే వెంటనే 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
MOST READ :
-
BIG BREAKING : సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకం రద్దు..!
-
Miryalaguda : మైనర్ బాలిక అత్యాచారం కేసులో సంచలన తీర్పు..!
-
Gold Price : బంగారం ధర తగ్గింది.. ఈరోజు ధర ఎంతంటే..!
-
TG News : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. విద్యా సంస్థలకు సెలవు, ఐటి ఉద్యోగులకు ఇంటి నుంచే పని, వారికి మాత్రం సెలవులు రద్దు..!









