Karimnagar : క్రీడలకు నిలయంగా కరీంనగర్..!

Karimnagar : క్రీడలకు నిలయంగా కరీంనగర్..!
కరీంనగర్, మనసాక్షి :
సౌత్ ఇండియా కరాటే ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలను ఆదివారం కరీంనగర్ పట్టణం లోని రేకుర్తి లో గల సాయి లక్ష్మి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల హాజరై పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ అన్ని క్రీడలకు నిలయంగా మారిందన్నారు. పిల్లలు మొబైల్ ఫోన్ లకు దూరంగా ఉండి క్రీడలకు దగ్గర అవడం ద్వారా వారిలో ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు మెంటల్ ఫిటెన్స్ అద్భుతంగా ఉండి చదువుల్లో చక్కగా రాణిస్తారని తెలిపారు.
ఈ సందర్భంగా టోర్నమెంట్ నిర్వాహకులు ఆర్ ప్రసన్న కృష్ణను అభినందించారు. కార్యక్రమానంతరం ఎమ్మెల్యే గంగులను టోర్నమెంట్ నిరాకులు ఘనంగా సన్మానించారు. ఈ టోర్నమెంట్ లో సుమారు 500 మంది క్రీడాకారులు వివిధ రాష్ట్రాల నుండి వచ్చి పాల్గొనానున్నారని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సి.ఎస్.కే.ఐ ఇండియా చీఫ్ శ్రీనివాస్, బిఆర్ఎస్ నాయకులు మంతెన కిరణ్, సీనియర్ కరాటే మాస్టర్ వసంత్ కుమార్, రాజిరెడ్డి, మొండయ్య, సురభి వేణుగోపాల్, మాడుగుల ప్రవీణ్, పెద్ది సందీప్, పెద్ది అనుదీప్, దేవేందర్,రాకేష్ వినోద్ లు పాల్గొన్నారు.
MOST READ :
-
Big Twist : పట్టపగలు దారిదోపిడిలో బిగ్ ట్విస్ట్.. ఏడుగురి అరెస్ట్..!
-
Hydra : రూ.500 కోట్ల విలువైన భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా.. ప్రహరీ, షెడ్ తొలగింపు..!
-
Miryalaguda : మిర్యాలగూడ తొలి ఎంపీపీ, తొలి సర్పంచ్.. కన్నెగంటి రంగయ్య మృతి.. నేడు అంతక్రియలు..!
-
District collector : డ్రగ్స్, ధూమపానం, మద్యపానం నిర్మూలనకై అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్..!









