కల్వకుర్తి పట్టణంలో దొంగల బెడద

కల్వకుర్తి పట్టణంలో దొంగల బెడద

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రతినిధి , మనసాక్షి

కల్వకుర్తి పరిధిలోని కళ్యాణ్ నగర్ కాలనీ 2 లోని నివసిస్తున్న సామ వసంతంs/o రాములు వయసు 40 సంవత్సరాలు వృత్తి మేస్త్రి పని చేసుకుంటూ నివాసముంటున్న ఇంటిలో శనివారం రాత్రి దొంగలు పడ్డారు.

 

తన బంధువులైన ఊరు చిన్న ఆదిరాల గ్రామానికి సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు వెళ్లి ఆదివారం తిరిగి వచ్చేసరికి తాళం వేసిన ఇంటికి తాళం పగలగొట్టినా విషయం గమనించి ఇంట్లోకి వెళ్లి చూడగానే ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి.

 

ఇంటిలోని బీరువా తాళం విరగొట్టి అందులోని 60 వేల రూపాయలు 2 తులాల బంగారం 20 తులాల వెండి తీసుకుపోవడం జరిగింది. ఈ విషయాన్ని స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారికి తెలియజేయడం ద్వారా క్లూస్ టీమును పిలిపించి నమూనాలు సేకరించి దర్యాప్తు చేస్తామన్నారు.

 

ALSO READ : 

  1. మిర్యాలగూడ : దొంగతనాలకు, మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు
  2. Education : తెలంగాణలో కెసిఆర్ విద్యా కానుక..!
  3. మదనపల్లిలో మహిళ మర్డర్..!!