Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసంగారెడ్డి జిల్లా

నకిలీ విత్తనాలు, పురుగుమందులు విక్రయిస్తే కఠిన చర్యలు.. వ్యాపారులకు వ్యవసాయ అధికారి హెచ్చరిక..!

నకిలీ విత్తనాలు, పురుగుమందులు విక్రయిస్తే కఠిన చర్యలు.. వ్యాపారులకు వ్యవసాయ అధికారి హెచ్చరిక..!

కంగ్టి, మన సాక్షి :

రైతులకు నకిలీ పురుగుల మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఏడీఏ నూతన్‌కుమార్‌ హెచ్చరించారు. గురువారం సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల‌ తడ్కల్‌ గ్రామంలోని ఎరువులు, పురుగుల మందుల దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా, ఇతర ఎరువుల స్టాక్‌ను పరిశీలించారు.

ఎక్కువ ధరలకు, నకిలీ పురుగు మందులు అమ్మితే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు సంబంధిత డీలర్లకు హెచ్చరించారు. రైతులకు నాణ్యమైన పురుగు మందులు, ఎరువులు నిర్దేశిత ధరలకు అమ్మాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఈవో సంతోష్ , దుకాణాల డీలర్లు ఉన్నారు.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా రాలేదా.. అందని వారికి కీలక సూచన..!

  2. Ration Cards : పేదలకు శుభవార్త.. కొత్త రేషన్ కార్డులు ఎప్పటినుంచంటే.. వారికి కూడా సన్న బియ్యం..!

  3. UPI : ఫోన్ పే, గూగుల్ పే డౌన్.. డిజిటల్ చెల్లింపుల్లో అంతరాయం..!

  4. UPI : గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే.. ఎందుకో తెలుసుకోండి..!

మరిన్ని వార్తలు