Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్
వైయస్ షర్మిలకు బెయిల్ మంజూరు
వైయస్ షర్మిలకు బెయిల్ మంజూరు
హైదరాబాద్, మనసాక్షి :
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల కు నాంపల్లి కోర్టు మంజూరు చేసింది. ఇద్దరి పూచి కత్తితో పాటు రూ. 30వేల తో బెయిల్ మంజూరు చేసింది.
విదేశాలకు వెళ్లాలనుకుంటే కోర్టు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది . పోలీసులతో దురుసుగా ప్రవర్తించడం, వారిని కొట్టిన కేసులో పలు సెక్షన్ల కింద ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.
కాగా ఆమెను చంచల్ గూడ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆమె చంచల్ గూడ జైల్లో ఉన్నారు. బెయిల్ మంజూరు కావడంతో ఈరోజు సాయంత్రం విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.









