మిర్యాలగూడ : కాంగ్రెస్ టికెట్ కోసం చల్ల తేజ దరఖాస్తు
మిర్యాలగూడ : కాంగ్రెస్ టికెట్ కోసం చల్ల తేజ దరఖాస్తు
మిర్యాలగూడ , మనసాక్షి :
మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు చల్ల తేజ శుక్రవారం గాంధీభవన్ లో దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే . శుక్రవారం చివరి తేదీ కావడం వల్ల భారీగా దరఖాస్తులు చేసుకున్నారు.
మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ బీసీ యువ నాయకులు చల్లా తేజ దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనకు కాంగ్రెస్ పార్టీ నుంచి మిర్యాలగూడ అసెంబ్లీ టికెట్ కేటాయిస్తే గెలిచి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా అన్నారు.
తన కు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న నాయకులలో ఎవరికి అధిష్టానం టికెట్ కేటాయించిన సంపూర్ణ సహకారం తోపాటు పూర్తి మద్దతు తెలియజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ALSO READ :
- Ponguleti : పొంగులేటి మూడు చోట్ల నుంచి దరఖాస్తులు.. ఎందుకో తెలుసా..!
- మిర్యాలగూడ: ఎమ్మెల్యే టికెట్ కోసం ముదిరెడ్డి నర్సిరెడ్డి దరఖాస్తు..!
- మిర్యాలగూడ అసెంబ్లీ టికెట్ కోసం జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి దరఖాస్తు..!
- Jana Reddy : జానారెడ్డి ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారా..? మరి సాగర్ నుంచి ఎవరు పోటీ..?










