Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

ఫ్లాష్ న్యూస్ : సెల్ఫీ దిగుతూ సాగర్ ఎడమ కాలువలో పడిన మహిళ.. కాపాడిన స్థానికులు..!

ఫ్లాష్ న్యూస్ : సెల్ఫీ దిగుతూ సాగర్ ఎడమ కాలువలో పడిన మహిళ.. కాపాడిన స్థానికులు..!

వేములపల్లి, మన సాక్షి :

నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలోని నాగార్జునసాగర్ ఎడమ కాలువ వద్ద సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు మహిళ కాలవలో పడిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వెంటనే స్పందించిన స్థానికులు మహిళను ప్రాణాలతో కాపాడారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుండి మిర్యాలగూడ వైపు వెళ్తున్న కుటుంబ సభ్యులు మండల కేంద్రంలోని నాగార్జునసాగర్ ఎడమ కాల్వ వద్ద భర్త, తమ్ముడు, కూతురుతో కలిసి సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి మహిళ కాలువలో పడింది.

వెంటనే గమనించిన స్థానికులు తాళ్ల సాయంతో మహిళను కాపాడడానికి తీవ్రంగా శ్రమించారు. సుమారు 40 నిమిషాల పాటు కష్టపడి మహిళను ప్రాణాలతో బయటకు తీశారు. కాగా వారి వివరాలు తెలియాల్సింది.

LATEST UPDATE : 

District SP : పగలు, రాత్రి 24/7 పెట్రొలింగ్.. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశం..!

Elections : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు అప్పుడే.. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి..!

NALGONDA : రుణమాఫీలో కాలయాపన చేస్తే రైతులు తగిన బుద్ధి చెబుతారు.. నల్గొండ కలెక్టరేట్ ఎదుట సిపిఎం ధర్నా..! 

Runamafi : రుణ మాఫీ కోసం రేషన్ కార్డులేని రైతులు దరఖాస్తు చేసుకోవాలి..!

మరిన్ని వార్తలు