Miryalaguda : ఎప్ సెట్ ఫలితాల్లో కె.ఎల్.ఎన్ విద్యార్థుల ప్రభంజనం..!
Miryalaguda : ఎప్ సెట్ ఫలితాల్లో కె.ఎల్.ఎన్ విద్యార్థుల ప్రభంజనం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఎప్ సెట్ ఫలితాల్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. అత్యుత్తమ ర్యాంకులు సాధించినట్లు కళాశాల కరస్పాండెంట్ కిరణ్ కుమార్ తెలిపారు.
ఇంజనీరింగ్ విభాగంలో విభాగంలో సండ్రాల పావని 5068వ ర్యాంకు, ఏ అశ్విత 10,389వ ర్యాంకు, పి నిత్య 12,618 వ ర్యాంకు, ఎం హాసిత 18,397 వ ర్యాంకు సాధించారు. అదే విధంగా అగ్రికల్చర్ విభాగంలో జూహ అంజుమ్ 3315 ర్యాంకు, షా ఎస్త అంజుమ్ 11,748వ ర్యాంకు సాధించారు.
అదేవిధంగా 30 వేల లోపు 20 మంది విద్యార్థులు సాధించి టాప్ టెన్ ఇంజనీరింగ్ కళాశాలలో సీట్లు సాధించుకున్నట్లు ఆయన తెలిపారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ కిరణ్ కుమార్, డైరెక్టర్లు పి ఎల్ ఎన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, హనుమంత రెడ్డి, చైతన్య ఆనంద్ అభినందించారు.









