Congress : కాంగ్రెస్ గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదు : టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు
కాంగ్రెస్ గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదు : టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు
నేలకొండపల్లి, మన సాక్షి.
కాంగ్రెస్ గెలుపు ను ఏ శక్తి అడ్డుకోలేదని టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు అన్నారు. మండలం లోని అనంతనగర్ లో సోమవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు… రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రకటించిన ఎస్సీ డిక్లరేషన్ కు విశేష స్పందన లభిస్తుందని అన్నారు. బీఆర్ఎస్-బీజెపీ ఒక్కటేనని ఖమ్మం సభతో తెలిపోయిందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
ALSO READ :
- Tragedy : ఆ తండ్రికి కూతురు అంటే అమితమైన ప్రేమ.. అనారోగ్యంతో కూతురు మృతి.. ఆ తర్వాత తండ్రి కూడా..!
- Revanth Reddy : యావత్ తెలంగాణ గుండెచప్పుడు.. కేసీఆర్ కేల్ ఖతం – బీఆర్ఎస్ దుకాణ్ బంద్.. వైరల్ అవుతున్న రేవంత్ రెడ్డి కౌంటర్..!
- NTR COIN : ఎన్టీఆర్ చిత్రంతో వంద రూపాయల నాణెం.. నేడు విడుదల.. ముద్రించింది ఎక్కడో తెలుసా..?
- Suryapet : సూర్యాపేటలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది.. పోటా పోటీగా ధర్నాలు..!
అవినీతి ప్రభుత్వం కు చరమగీతం. పాడేందుకు సైనికుల్లా పని చేస్తున్నారని అన్నారు. పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా సర్పంచ్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని.ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన సర్పంచులే విమర్శిస్తున్న.. పాలకులకు కనువిప్పు కలగటం లేదని అన్నారు.
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో సర్పంచ్ పెంట ముళ్ళ పుల్లమ్మ కాంగ్రెస్ నాయకులు పుల్లారెడ్డి. బచ్చల కూరి నాగరాజు. జెర్రిపోతుల అంజలి. పాకనాటి కన్నా రెడ్డి. ఎడవల్లి నాగరాజు. పగటి కత్తుల సుదర్శన్, వడ్లమూడి శ్రీనివాస్తదితరులు పాల్గొన్నారు.









