Defence deal: రక్షణ మంత్రిత్వ శాఖతో భారీ ఒప్పందం..!
Defence deal: రక్షణ మంత్రిత్వ శాఖతో భారీ ఒప్పందం..!
హైదరాబాద్:
భారత్ ఫోర్జ్ లిమిటెడ్ కంపెనీ దేశంలోనే స్వదేశీ సాంకేతికతతో తయారైన 184 అడ్వాన్స్డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్స్ (ATAGS) ను సరఫరా చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖతో ఒక ముఖ్యమైన ఒప్పందాన్ని ఖరారు చేసింది. ఈ ఒప్పందం విలువ రూ. 4,140 కోట్లుగా ఉండగా, 155mm/52 క్యాలిబర్ ఆర్టిలరీ వ్యవస్థల కోసం సుమారు రూ.6,900 కోట్ల సేకరణ ప్రణాళికలో ఇది 60 శాతం భాగాన్ని కలిగి ఉంది.
భారత్ ఫోర్జ్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ బాబా కళ్యాణి ఈ ఒప్పందాన్ని రక్షణ తయారీలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి ఒక గొప్ప ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక ఒప్పందం రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో జరిగింది.
ఆత్మనిర్భర్ దిశగా..
ఈ సందర్భంగా బాబా కళ్యాణి మాట్లాడుతూ.. ఈ ఒప్పందం తమకు గర్వకారణమని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రక్షణ రంగంలో స్వావలంబన సాధన కోసం చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్ ఆలోచనకు ఈ ఒప్పందం సాక్ష్యంగా నిలుస్తుందని అన్నారు.
రక్షణ మంత్రిత్వ శాఖ, భారత సైన్యం, డీఆర్డీఓ, ఏఆర్డీఈ సంస్థలతో పాటు భారత్ ఫోర్జ్ బృందం చేసిన అద్భుతమైన కృషిని, సహకారాన్ని తాము అభినందిస్తున్నామని వెల్లడించారు. ఈ ఒప్పందం ద్వారా భారత రక్షణ రంగంలో స్వదేశీ తయారీకి బలమైన పునాది వేయడంతో పాటు, దేశ సైనిక శక్తిని మరింత పటిష్టం చేసే దిశగా ఒక ముందడుగు పడిందని నిపుణులు చెబుతున్నారు.
MOST READ :
-
Electricity Bill : విద్యుత్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. జారీ చేసిన CMD..!
-
నకిలీ విత్తనాలు, పురుగుమందులు విక్రయిస్తే కఠిన చర్యలు.. వ్యాపారులకు వ్యవసాయ అధికారి హెచ్చరిక..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే డౌన్.. డిజిటల్ చెల్లింపుల్లో అంతరాయం..!
-
UPI : గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే.. ఎందుకో తెలుసుకోండి..!
-
TG News : తెలంగాణ యువతకు గుడ్ న్యూస్.. యువ వికాసం పథకానికి మీరు అర్హులేనా..!









