Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Raghu veer: జయహో రఘువీరా పాట ఆవిష్కరణ.. బి ఎల్ ఆర్ నేతృత్వంలో రూపొందించిన పాట..!

Raghu veer: జయహో రఘువీరా పాట ఆవిష్కరణ.. బి ఎల్ ఆర్ నేతృత్వంలో రూపొందించిన పాట..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో రూపొందించిన జయహో రఘువీరా పాట ను ముఖ్యనాయకులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి , జానారెడ్డి ఆవిష్కరించారు. మిర్యాలగూడలో పార్లమెంటు అభ్యర్థి రఘువీర్ రెడ్డి గెలుపుకై నిర్వహించిన బహిరంగ సభలో ఆవిష్కరించారు .

అనంతరం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తన ఎన్నికల్లో 50వేల మెజారిటీ వచ్చినందుకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో రఘువీర్ రెడ్డికి లక్ష ఓట్ల మెజార్టీ తీసుకురావాలని కోరారు. మిర్యాలగూడ నియోజకవర్గానికి ఉత్తంకుమార్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెండు కన్నులు అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించాలని, అభివృద్ధికి సహకరించాలని మాత్రులను ఆయన కోరారు. తాను చేపట్టే సామాజిక కార్యక్రమాలన్నీ అతి త్వరలో ప్రారంభిస్తామని, వాటి మీద జరిగే ప్రచారాన్ని ప్రతి కార్యకర్త తిప్పి కొట్టాలన్నారు.

ALSO READ : Telangana : కెసిఆర్ , కేటీఆర్, జగదీశ్ రెడ్డి పై మిర్యాలగూడ సభలో కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు ..!

నీటిపారుదల, రోడ్డు భవనాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తంకుమార్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ సిఎల్పీ నేత కుందూరు జానారెడ్డి , నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి , నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి , డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ మాజీ ఎమ్మెల్సీ మిర్యాలగూడ భారతి రాగ్యా నాయక్ , నియోజకవర్గం నాయకులు స్కైలాబ్ నాయక్, గాయం ఉపేందర్ రెడ్డి , నూకల వేణుగోపాల్ రెడ్డి , తమ్ముడ బోయిన అర్జున్, పగిడి రామలింగయ్య , ముదిరెడ్డి నర్సిరెడ్డి, చిలుకూరు బాలు, శాగా జలంధర్ రెడ్డి , రుణాల్ రెడ్డి , దేశిడి శేఖర్ రెడ్డి, కొమ్ము శ్రీనివాస్, మహబూబ అలీ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : Truecaller : కాల్స్ , మెసేజ్ లు వచ్చినప్పుడు ఫోన్ చూడాల్సిన అవసరం లేదు.. డెస్క్ టాప్ లో ఎలా చూడాలో తెలుసుకోండి..!

మరిన్ని వార్తలు