Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగం.. విచారణ చేపట్టిన జడ్పి సీఈవో..!

Nalgonda : గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగం.. విచారణ చేపట్టిన జడ్పి సీఈవో..!

మనసాక్షి, కొండమల్లేపల్లి :

గ్రామపంచాయతీ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణతో శుక్రవారం రోజున జడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి విచారణకు చేపట్టారు. పూర్తి వివరాలకు వెళితే.. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం లోని చిన్న అడిచర్లపల్లి గ్రామపంచాయతీ చెందిన పంచాయతీ కార్యదర్శి సరస్వతి నిధులు దుర్వినియోగం చేశారని ఈనెల 21 తారీఖున కలెక్టర్ ఫిర్యాదు చేశారు.

కలెక్టర్ వెంటనే స్పందించి అధికారులను విచారణ చేయమని తెలుపగా విచారణ చేపట్టారు.  గ్రామపంచాయతీ పరిధిలో ఇంటి పన్నులను డబ్బులను రికార్డులు నమోదు చేసుకోకుండా స్వతగా డబ్బులు తీసుకున్నారని, అదేవిధంగా మండలానికి చెందిన ఎంపీడీవో బాలరాజ్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి సరస్వతి ఇద్దరు కుమ్మక్కై ఎస్సీ ఎస్టీ సర్పంచులను భయభ్రాంతులకు గురిచేస్తూ నాన రకాలుగా ఇబ్బందులు పెట్టారని ఆరోపణతో రావడంతో విచారణ జరిగింది విచారణ అధికారి తెలిపారు.

ఇట్టి విషయమై తదుపరి వివరణ కలెక్టర్ కి పూర్తి నివేదిక అందిస్తామని జెడ్పి సీఈఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిసిఓ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ హరినాథ్ సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు