Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్
Kiledi : వారు మహా కిలేడీ లు..!

Kiledi : వారు మహా కిలేడీ లు..!
కోటగిరి, మన సాక్షి :
దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళ దొంగలను పోలీసులు పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. కోటగిరి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద శనివారం ఇద్దరు మహిళలు అనుమానితులుగా తిరుగుతుండ గా వారిని పట్టుకొని విచారించగా గత నెలలో పోతంగల్ లో జరిగిన దొంగతనాలు మేమే చేశామని ఒప్పుకున్నారు.
వారి వద్ద నుంచి 6.9 గ్రాముల బంగారం. 44.51 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. వాటి విలువ 72,557 ఉంటుందని అన్నారు. పోతంగల్ గ్రామానికి చెందిన మొండి రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వారిని బోధన్ కోర్టులో హాజరు పరుస్తామని పేర్కొన్నారు.
MOST READ :









