Runamafi : రుణమాఫీ పై సీఎం రేవంత్ రెడ్డి మరో ప్రకటన.. కీలక అప్ డేట్..!
Runamafi : రుణమాఫీ పై సీఎం రేవంత్ రెడ్డి మరో ప్రకటన.. కీలక అప్ డేట్..!
మన సాక్షి :
తెలంగాణలో రైతులను రుణ విముక్తులను చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక పర్యాయాలు చెప్పారు. ఇటీవల మంత్రి మండలి సమావేశం నిర్వహించి కూడా ఒకేసారి రెండు లక్షల రూపాయలను మాఫీ చేస్తామని చెప్పారు. అంతేకాకుండా కటాఫ్ డేట్స్ కూడా ప్రకటించారు. 2023 డిసెంబర్ 9వ తేదీ కంటే ముందు బ్యాంకులలో తీసుకున్న రైతుల రుణాలు మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు.
ALSO READ : Cm Revanth Reddy: నన్ను తప్పించండి.. సోనియా, రాహుల్ గాంధీలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి..!
ఇది ఇలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ పై మరో కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటికీ రేషన్ కార్డు అవసరం ఉంటుందని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ రుణమాఫీకి రేషన్ కార్డు అవసరం లేదని తెలిపారు. రుణమాఫీ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని తెలియజేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రెండు లక్షల రూపాయలను ఏకకాలంలో మాఫీ చేయనున్నట్లు తెలిపారు.
ALSO READ :
Swarnagiri : ఏ నోట విన్నా స్వర్ణగిరి దేవాలయమే.. ప్రత్యేకతలు ఏంటో మీరూ చూడండి..!
BREAKING: తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. ధరణి ఫైళ్ల తనిఖీ..!









