పేద రైతు కుటుంబాల్లో మెరిసిన విద్యా కుసుమాలు.. వైద్య సీట్లు సాధించిన విద్యార్థులు..!
పేద రైతు కుటుంబాల్లో మెరిసిన విద్యా కుసుమాలు.. వైద్య సీట్లు సాధించిన విద్యార్థులు..!
కంగ్టి, మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో ఇటీవల ముగ్గురు విద్యార్థులు ఎంబీబీఎస్ కోర్స్ లో సీట్లు పొందారు. కంగ్టి గ్రామానికి చెందిన సిర్మా అఖిల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సీట్ సాధించగా.. తురకవడగామ కు చెందిన గులే ప్రవీణ్ మహబూబాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు పొందారు. తడ్కల్ ఎడ్ల రేగడి తండా కు చెందిన జీవన్ సింగ్ కు నల్గొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది.
ముగ్గురు విద్యార్థులు పేద రైతు కుటుంబాలకు చెందినవారు కావడం విశేషం. మారుమూల ప్రాంతానికి చెందిన రైతు కుటుంబాల నుంచి వైద్యులుగా శిక్షణ పొందడానికి అర్హత సాధించడంతోపాటు ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు పొందడంతో కుటుంబీకులతోపాటు పరిసర గ్రామాల్లోని ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు.
ప్రైవేటు కాలేజీల్లో ఫీజులు చెల్లించలేని కుటుంబంలో విద్యా కుసుమాలు ఎదగడంతో వారి పంట పండిందని అంతటా హర్షం వ్యక్తం అవుతుంది.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు వచ్చేది అప్పుడే.. మంత్రి తుమ్మల స్పష్టం..!
-
Nalgonda : రుణాలు ఇప్పిస్తామని భారీ మోసం.. నకిలీ బ్యాంకు అధికారుల ఆటకట్టు..!
-
Thummala : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. రూ.2 లక్షల పైబడి రుణం ఉన్నవారికి మంత్రి తుమ్మల స్పష్టం..!
-
Peddapalli : ఆదివారం వస్తే వారికి పండగ.. నేనే ఇన్చార్జి, ఎవరొచ్చినా.. నా పేరు చెప్పండి..!









