PM KISAN : రైతులకు గుడ్ న్యూస్.. వారికి ఒకేసారి రూ.4వేలు ఖాతాలలో జమ..!

PM KISAN : రైతులకు గుడ్ న్యూస్.. వారికి ఒకేసారి రూ.4వేలు ఖాతాలలో జమ..!
మనసాక్షి, వెబ్ డెస్క్:
కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం ద్వారా పెట్టుబడి సహాయం అందజేస్తున్న విషయం తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని ప్రారంభించారు. దీని ద్వారా రైతులకు ప్రతి ఏటా మూడు విడతలుగా 6000 రూపాయలను పంటల పెట్టుబడికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు.
ఇప్పటివరకు 21 విడతలుగా రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేశారు. ప్రతి విడతకు 2000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో నేరుగా జమ చేస్తున్నారు. ఇదిలా ఉండగా 21వ విడత ఇటీవల ప్రతి రైతుకు 2000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో జమ చేశారు.
చాలామంది రైతులకు సాంకేతిక కారణాల వలన ఖాతాలలో డబ్బులు జమ కాలేదు. దాంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా పీఎం కిసాన్ డబ్బులు ఖాతాలలో జామ చేసే గడువు ముగిసింది. కానీ రైతులకు ఖాతాలలో జమ కాలేదు. దాంతో ఆందోళన చెందుతున్న రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది.
దేశవ్యాప్తంగా రైతులు 22వ విడత పిఎం కిసాన్ డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. కాదా పీఎం కిసాన్ 22వ విడత రైతుల ఖాతాలలో జమ చేసే సమయంలోనే 21వ విడతలో డబ్బులు రాని రైతులకు కూడా రెండు ఒకేసారి జమ చేయనున్నారు. రెండు విడుతల డబ్బులకు గాను ఒకేసారి నాలుగు వేల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేస్తారు.
MOST READ :
-
TG News : రైతులకు భారీ శుభవార్త.. వారి అకౌంట్లో డబ్బులు జమ..!
-
Nalgonda : రూ.300 కోట్లతో బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ సంస్థ.. డైరెక్టర్ ఇంటిముందు బాధితుల ఆందోళన..!
-
TG News : టీచర్లకు బిగ్ షాక్.. అలా చేస్తే ఉద్యోగం ఊస్ట్..!
-
Rythu Bharosa : రైతు భరోసాలో కీలక మార్పులు.. యాసంగి భరోసా వారికే.. బిగ్ అప్డేట్..!









