తెలంగాణBreaking Newsహైదరాబాద్

EV : సరికొత్త ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ కారు.. గ్లోబల్ సమ్మిట్ లో ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..!

EV : సరికొత్త ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ కారు.. గ్లోబల్ సమ్మిట్ లో ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..!

మన సాక్షి, హైదరాబాద్ :

ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ రూపొందించిన సరికొత్త ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ కారును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 జరుగుతున్న భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి లాంఛనంగా ఈవీ కారును ఆవిష్కరించి దానిని కొద్ది దూరం నడిపారు.

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తో కలిసి కారును పరిశీలించారు. ఒలెక్ట్రా సీతారాంపూర్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌లో ఈ కారును రెండు బ్యాటరీలు కలిగి ఉండేలా రూపొందించారు.

ఇండిజీనియస్ మాడ్యులార్ స్కేట్‌బోర్డు ఫ్లాట్‌ఫామ్‌తో వివిధ వేరియంట్లతో సెడాన్, ఎస్యూవీ మాడళ్లను రూపొందించారు. కారును ఆవిష్కరించిన అనంతరం ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ నూతన ఎలక్ట్రిక్ బస్సు (12 మీటర్ల సూపర్ లగ్జరీ బస్సు)ను కూడా ముఖ్యమంత్రి పరిశీలించారు.

MOST VIEWS 

  1. TG News : గ్లోబల్ సమ్మిట్ వేదికగా.. కలెక్టరేట్ లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ..!

  2. District collector : బాక్స్ టు బాక్స్.. క్షుణ్ణంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్..!

  3. TG News : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు.. రెండో విడుతలో ఏకగ్రీవాల జోరు, అన్ని వందలా..!

  4. TG News : తెలంగాణ రైజింగ్, గ్లోబల్ సమ్మిట్ రేపటి నుంచే.. ఏంచేస్తారో తెలుసా..!

  5. TG News : రైతులకు తీపి కబురు.. ఖాతాలలో రూ.7887 కోట్లు, రాకుంటే ఇలా చేయండి..!

మరిన్ని వార్తలు