Cotton : పత్తిలో రసం పీల్చే పురుగులకు చెక్.. సింపుల్ చిట్కా, వ్యవసాయ అధికారి సూచన..!
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని నాగూర్ (కే) గ్రామ శివారులో సోమవారం వ్యవసాయ విస్తీర్ణధికారి సంతోష్ పత్తి పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

Cotton : పత్తిలో రసం పీల్చే పురుగులకు చెక్.. సింపుల్ చిట్కా, వ్యవసాయ అధికారి సూచన..!
కంగ్టి, మన sals
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని నాగూర్ (కే) గ్రామ శివారులో సోమవారం వ్యవసాయ విస్తీర్ణధికారి సంతోష్ పత్తి పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పొలాల్లో రసం పీల్చే పురుగులు, ప్రత్యేకించి దోమ ఉధృతిని గమనించిన అధికారులు, రైతులకు దాని నివారణా చర్యలపై కీలక సూచనలు చేశారు.
పంట రక్షణకు ప్రతి రైతు తప్పనిసరిగా పసుపు, నీలం జిగురు అట్టలను వినియోగించాలని అధికారులు స్పష్టం చేశారు. రైతులకు సులభంగా అర్థమయ్యే రీతిలో ప్రాక్టికల్ ఉదాహరణలతో జిగురు అట్టల ప్రాముఖ్యతను వివరించారు. పురుగుల మందుల పిచికారీ ఖర్చు తగ్గించుకోవడమే కాకుండా, ప్రారంభ దశలోనే దోమ ఉధృతిని అరికట్టడానికి జిగురు అట్టలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
యూరియా వాడకం తగ్గించాలి
అదేవిధంగా, పొలాల్లో యూరియా (నత్రజని) ఎరువులను పరిమితికి మించి వాడటం వల్ల మొక్కలు అతిగా పెరిగి, దోమ మరియు ఇతర రసం పీల్చే పురుగుల ఉధృతి తీవ్రమవుతుందని హెచ్చరించారు. అనవసరమైన యూరియా వాడకాన్ని తగ్గించాలి అని సూచించారు.ఈ కార్యక్రమంలో రైతులు ఉన్నారు.
MOST READ :
- విజయం అంటే ఇదీ.. పేద టైలర్ కుమారుడికి రూ.1.06 కోట్ల ప్యాకేజీ..!
- Almatti : కదిలిన కృష్ణమ్మ ఆల్మట్టి డ్యాం గేట్ల ఎత్తివేత.. దిగువకు భారీగా వరద..!
- Ration Cards : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆగస్టు నెల నుంచి స్మార్ట్ కార్డుల ద్వారానే రేషన్ పంపిణీ..!
- District collector : జిల్లా కలెక్టర్ సీరియస్ వార్నింగ్.. ఉదయం 9 గంటలకే అటెండెన్స్ పడాల్సిందే..!









